News May 22, 2024

పర్సెంటేజీ ఇస్తేనే సినిమాల ప్రదర్శన: ఫిల్మ్ ఎగ్జిబిటర్లు

image

నిర్మాతలు మల్టీప్లెక్స్‌లకు ఇచ్చినట్లు తమకూ పర్సెంటేజీ ఇస్తేనే చిత్రాలను ప్రదర్శిస్తామని ఫిల్మ్ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు జూలై 1వరకు గడువు విధించారు. అటు ఇకపై అద్దె ప్రాతిపదికన ప్రదర్శనలు ఉండవని తేల్చిచెప్పారు. ముందస్తు ఒప్పందంతో కల్కి, పుష్ప2, గేమ్ ఛేంజర్, భారతీయుడు-2 మూవీలకు మినహాయింపు ఉంటుందన్నారు. మరోవైపు ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలూ ప్రదర్శించబోమన్నారు.

Similar News

News March 9, 2026

BREAKING: శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్యాస్ ధరల <<19316911>>పెరుగుదలతో<<>> ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట లభించనుంది.

News March 9, 2026

కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

image

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.

News March 9, 2026

నెతన్యాహుతో మాట్లాడే డిసైడ్ చేస్తా: ట్రంప్

image

ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడు ఆపాలనేది ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అది సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, సరైన సమయంలో డెసిషన్ తీసుకుంటామన్నారు. తాము దాడి చేయకపోతే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అంతం చేసి ఉండేదన్నారు. కాగా ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ యుద్ధం పదో రోజుకి చేరింది. మరోవైపు సౌదీపై దాడిలో భారతీయులు ఎవరూ చనిపోలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.