News March 26, 2024
ఇండిపెండెంట్గా మాజీ సీఎం.. బీజేపీ మద్దతు

తమిళనాడు మాజీ CM, అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఉనికి కోసం పోరాడుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. BJP సైతం వ్యూహాత్మకంగా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టకుండా పన్నీర్కు మద్దతు ప్రకటించింది. దీంతో ఈ స్థానం తమిళనాట హాట్టాపిక్గా మారింది. BJP మద్దతుతో పాటు, అన్నాడీఎంకేలోని చీలిక వర్గం మద్దతుతో సులువుగా గెలుస్తానని పన్నీర్ ధీమాగా ఉన్నారు.
Similar News
News February 10, 2026
కొడంగల్కు సీఎం రేవంత్

TG: CM రేవంత్ రేపు కొడంగల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30గం.కు కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం HYDకు తిరిగి పయనమవుతారు. రేపు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 8,203 కేంద్రాలు, 16,301 బ్యాలెట్ బాక్సులను EC సిద్ధం చేసింది. మొత్తం 12,930మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
News February 10, 2026
రైతులకు వాట్సాప్లో APMIP సేవలు

AP: వాట్సాప్(మన మిత్ర)లో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(APMIP)ను ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ‘రైతులు ఫోన్తో 9552300009 నంబర్కు వాట్సాప్లో Hi అని పంపి, APMIPను ఎంపిక చేసుకోవాలి. సబ్సిడీ కోసం నమోదు, దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడం వంటి సేవలను ఇంటి నుంచే పొందవచ్చు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు ఆన్లైన్లో కొని సురక్షితంగా చెల్లింపులు చేయొచ్చు’ అని తెలిపారు.
News February 10, 2026
US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

H-1B వీసా ప్రోగ్రామ్ రద్దు చేసే బిల్లును రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమెరికాలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అమెరికన్ల కంటే విదేశీ కార్మికులకు కార్పొరేట్లు ప్రాధాన్యం ఇస్తుండటం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని వాపోయారు. కాగా H1B వీసా పొందుతున్నవారిలో 80 శాతం మంది భారత్, చైనాకు చెందిన వారే ఉండటం గమనార్హం.


