News October 15, 2025
గుండెపోటుతో గోవా మాజీ సీఎం కన్నుమూత

గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్(79) కన్నుమూశారు. ఇంట్లో నిన్న రాత్రి ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి ఒంటిగంట సమయంలో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ 3PMకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నాయక్ మృతి పట్ల పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవకు జీవితం అంకితం చేశారని కొనియాడారు.
Similar News
News November 18, 2025
దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.
News November 18, 2025
దోషులు పాతాళంలో ఉన్నా వదలం: అమిత్ షా

ఢిల్లీ బ్లాస్ట్ దోషులు పాతాళంలో ఉన్నా వదలబోమని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి నిర్మూలించడం మనందరి బాధ్యతని అన్నారు. హరియాణాలోని ఫరీదాబాద్లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని సృష్టిస్తాయని, ఈ విషయంలో జోనల్ కౌన్సిల్స్ పాత్ర కీలకమని అన్నారు.
News November 18, 2025
జనవరిలోనే WPL షురూ.. డేట్స్ ఇవేనా?

వచ్చే ఏడాది జనవరి 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఫైనల్ జరిగే అవకాశం ఉందని Cricbuzz తెలిపింది. WPL-2026 కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయొచ్చని తెలిపింది. ఫిబ్రవరిలో జరిగే T20 పురుషుల ప్రపంచకప్ను భారత్ కో-హోస్ట్ చేస్తుండటంతో WPLను ముందుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 26న వేదికలు, తేదీలు ఖరారు కానున్నాయి. 27న మెగా వేలం జరగనుంది.


