News August 12, 2025
మాజీ ఎమ్మెల్యేలు కన్నుమూత

AP: అన్నమయ్య(D) రాజంపేట మాజీ MLA కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1989లో రాజంపేట నుంచి INC MLAగా గెలిచారు. 1985, 1994, 2009లో పోటీ చేసి ఓడిపోయారు. అటు తిరుపతి(D) శ్రీకాళహస్తి మాజీ MLA తాటిపర్తి చెంచురెడ్డి కూడా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1988 ఉపఎన్నికలో INC తరఫున MLAగా గెలిచారు.
Similar News
News March 17, 2026
పాక్ దాడి పిరికిపంద చర్య: భారత్

అఫ్గానిస్థాన్లోని ఆస్పత్రిపై <<19403539>>పాకిస్థాన్ దాడిని<<>> భారత్ ఖండించింది. రంజాన్ వేళ ఇలా చేయడం దారుణమని మండిపడింది. దీన్ని అఫ్గాన్ సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇది మిలిటరీ దాడి కాదు మారణహోమమని పేర్కొంది. ఇదొక పిరికిపంద చర్యగా అభివర్ణించింది. కాగా పాక్ దాడిలో దాదాపు 400 మంది అమాయకులు మరణించారు.
News March 17, 2026
KTR వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్

TG: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు <<19405508>>ఎందుకు<<>> చెప్పాలన్న KTR వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనందుకు, మేం కొత్త కార్డులతో పాటు సన్నబియ్యం ఇస్తున్నందుకు KTR ధన్యవాదాలు చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నందుకు థాంక్స్ చెప్పాలి’ అని స్పష్టం చేశారు.
News March 17, 2026
పెద్దల రుణాలు రైటాఫ్.. పేదల అప్పులపై కఠినం.. కావాలి మానవత్వం!

పేదలు, రైతులు తీసుకొన్న అప్పులను ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు ‘పెద్దల’ రుణాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. 11 ఏళ్లలో ఏకంగా రూ.9.75 లక్షల కోట్ల అప్పులను రైటాఫ్ చేసినట్లు కేంద్రం పార్లమెంటులో చెప్పడంతో చర్చ మొదలైంది. పేదల రుణాల వసూళ్లలోనూ మానవత్వంతో సున్నితంగా వ్యవహరించాలని పలువురు పేర్కొంటున్నారు. కట్టడం ఆలస్యమైతే వడ్డీల బాదుడు నుంచి విముక్తి కలిగించాలంటున్నారు. మీరేమంటారు?


