News June 17, 2024
ఏడాదిలోనే నాలుగు ఘోర రైలు ప్రమాదాలు

వరుస ప్రమాదాలు భారతీయ రైల్వేకు మాయని మచ్చగా మారుతున్నాయి. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ రైలు దుర్ఘటనలో 293మంది మరణించారు. అదే ఏడాది OCTలో విజయనగరంలో 2 రైళ్లు ఢీకొనడంతో 14 మంది చనిపోయారు. ఈనెల 2న పంజాబ్లోని ఫతేగఢ్ సాహెబ్ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. తాజాగా ఇవాళ బెంగాల్ న్యూజల్పాయిగుడిలో ప్యాసింజర్, గూడ్స్ ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. దీంతో ఇండియన్ రైల్వేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Similar News
News January 17, 2026
పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు.. నేటి నుంచే అమల్లోకి

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన <<18836703>>విషయం<<>> తెలిసిందే. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆర్థిక సాయం భార్య పేరున జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దివ్యాంగ దంపతులకు వివాహానంతరం ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు, నివాసం, వైద్య ఖర్చులు, జీవనోపాధికి సహాయ పడుతుందని పేర్కొంది.
News January 17, 2026
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన) ఏప్రిల్ కోటాను ఈనెల 19న TTD విడుదల చేయనుంది. ఈ-డిప్ కోసం 21వ తేదీ 10AM వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న 12PM లోపు డబ్బు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లు విడుదల కానున్నాయి.
News January 17, 2026
పూజ గది ఎక్కడ ఉంటే ఉత్తమం?

ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉండాలనే నియమం అందరికీ వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇల్లు పెద్దదైతే ఈశాన్యం అనుకూలం, కానీ చిన్న ఇళ్లలో తూర్పు, పడమర దిశలలో, మధ్య భాగానికి ఉత్తరం వైపుగా జరిపి ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ‘పడకగది లేదా వంటగదిలో పూజ అస్సలు చేయకూడదు. పూజ గదికి పవిత్రతతో పాటు కాస్త గోప్యత కూడా అవసరమని గ్రహించాలి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


