News April 11, 2025
గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు

TG: యాదాద్రి(D) గంధమల్ల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 TMCల నుంచి 1.41 TMCలకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.575.56 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా అప్పటి BRS ప్రభుత్వం గంధమల్ల వద్ద 9.86 TMCలతో రిజర్వాయర్ నిర్మించాలనుకుంది. ముంపునకు గురయ్యే 5 గ్రామాల నుంచి వ్యతిరేకత రావడంతో 4.28 TMCలకు కుదించింది. తాజాగా INC సర్కార్ 1.41 TMCలకు పరిమితం చేసింది.
Similar News
News February 17, 2026
అజిత్ పవార్ మృతి.. కీలక పరిణామం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ <<19106331>>మృతి కేసులో<<>> కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంపై సీబీఐ విచారణ చేయాలని ఆయన భార్య, Dy.CM సునేత్రా పవార్ డిమాండ్ చేశారు. NCP లీడర్లు, పెద్ద కుమారుడు పార్థ్తో ఆమె సీఎం ఫడణవీస్ను కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. ‘ఈ విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తామన్నారు’ అని NCP నేత సునీల్ వెల్లడించారు.
News February 17, 2026
బరువు పెరగని జపనీస్.. ‘హరా హచి బు’ సీక్రెట్ తెలుసా?

ప్రపంచంలో తక్కువ ఊబకాయం కలిగిన జపాన్ నుంచి భారత్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కడుపు 80% నిండాక తినడం ఆపడం (హరా హచి బు), స్కూల్ స్థాయి నుంచే పోషకాహారంపై అవగాహన, చక్కెర తగ్గించడం, నడకను జీవనశైలిలో భాగం చేయడం అక్కడ కీలకం. నడుము కొలతను పర్యవేక్షించే ‘మెటాబో లా’ వంటి చట్టాలు, హెల్తీ ఫుడ్ ఈజీగా దొరకడం వల్ల జపాన్ ఈ ఘనత సాధించింది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో మనతో పోలిస్తే వారికి డిసిప్లిన్ చాలా ఎక్కువ.
News February 17, 2026
ఇందాపూర్ సహా 4 డెయిరీలకు నెయ్యి ఆర్డర్లు: BR నాయుడు

AP: శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యి కొనుగోలులో నాణ్యత, పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ‘నెయ్యి నాణ్యత తగ్గకుండా సేకరణ పరిధిని 1,500KM నుంచి 800KMకు తగ్గించాం. ట్యాంకర్లకు GPS లాక్ సిస్టమ్ ఏర్పాటుచేశాం. అలాగే ఇందాపూర్ డెయిరీకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చామనేది అవాస్తవం. ప్రమాణాలు పాటించిన నందిని, మదర్, సంగం డెయిరీలకూ ఆర్డర్లు ఇచ్చాం’ అని ట్వీట్ చేశారు.


