News November 7, 2025

GDK: బంగారు పతకాలు అందుకున్న ఎంబీఏ విద్యార్థులు

image

గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళాశాలకు చెందిన ఆరుగురు ఎంబీఏ విద్యార్థులు బంగారు పతకాలను అందుకున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించినందుకు గాను డీ.తరుణ, ఎం.మౌనిక, డీ.ఉషశ్రీ, పీ.కళ్యాణి, కే.కళ్యాణి, సీహేచ్‌.సాగరికలు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా ఈ బంగారు పతకాలు అందుకున్నారు.

Similar News

News January 23, 2026

సంగారెడ్డి: ఇంటర్ హాల్ టికెట్లు సరి చూసుకోండి

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ హాల్ టికెట్లు సరిచూసుకోవాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం సూచించారు. http://tgbie.cgg.gov.inలో హాల్ టికెట్ చూసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏమైనా పొరపాట్లు ఉంటే ఈనెల 25వ తేదీలోపు సరిచేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.

News January 23, 2026

సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. M.Tech ఇన్ ECE పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://iiits.ac.in/careersiiits/jrf-srf-project-positions/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 27.

News January 23, 2026

రాయచోటిలో ఆపరేషన్ వికటించి తల్లిబిడ్డల మృతి

image

అన్నమయ్య జిల్లా రాయిచోటిలో ఆపరేషన్ వికటించి తల్లిబిడ్డలు మృతి చెందిన విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాయచోటిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి వద్ద చోటుచేసుకున్న ఘటన వివరాలను మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దమండెం మండలం చింతమానివారిపల్లికి చెందిన తవలం వెంకటరమణ భార్య ఈశ్వరమ్మ ప్రసవ నొప్పులతో రాయచోటిలోని ఓ ఆసుపత్రికి వెళ్లగా ఈ ఘటన జరిగిందన్నారు.