News November 2, 2025

GDWL: ఆహారం విషయంలో అలసత్వం వద్దు: జాయింట్ కలెక్టర్

image

విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని, ఆహారం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నరసింగరావు హెచ్చరించారు. కాగా, ఎర్రవల్లిలో ఎస్సీ బాలుర గురుకులంలో శనివారం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో పలువురు విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, ఆహారం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వ్యవహరించాలని పాఠశాల సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Similar News

News November 3, 2025

నిరూపిస్తే.. పదవికి రాజీనామా చేస్తా: KTR

image

TG: కంటోన్మెంట్ నియోజకవర్గానికి CM రేవంత్ రూ.4 వేలకోట్లు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని KTR ఓ ఇంటర్వ్యూలో సవాలు చేశారు. నిరూపించలేకపోతే CM రేవంత్ క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. ‘4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితేనే 420 హామీలు అమలవుతాయి. PJR మీద ఇప్పుడు ప్రేమ పొంగుకొచ్చింది. కానీ 2023 ఎన్నికల్లో విష్ణువర్ధన్‌కు ఎందుకు టికెటివ్వలేదు’ అని ప్రశ్నించారు.

News November 3, 2025

కార్తీక పౌర్ణమి.. 10 లక్షల దీపాలతో ఏర్పాట్లు

image

UPలోని కాశీ మరో అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న అక్కడ దేవ్ దీపావళిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గంగా నది ఘాట్‌లతోపాటు నదీ తీరంలోని 20 ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనుంది. అలాగే కాశీ గొప్పతనాన్ని చాటేలా 500 డ్రోన్లతో ప్రదర్శన, లేజర్ షో, 3D ప్రజెంటేషన్ ఉండనుంది.

News November 3, 2025

SLBC టన్నెల్.. రేపటి నుంచి సర్వే

image

TG: SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రేపు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సొరంగాల నిపుణుల సహాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు. గతేడాది టన్నెల్ కూలి 8 మంది కార్మికులు మరణించడంతో అలాంటి లూస్ సాయిల్ ఎక్కడ ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సొరంగం మొత్తం పొడవు 43.9 కి.మీ కాగా ఇంకా 9.5 కి.మీ తవ్వాల్సి ఉంది.