News May 13, 2024

GET READY తూ.గో. జిల్లా

image

సార్వాత్రిక ఎన్నికల పోలింగ్ నేడే కావడంతో ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 నియోజకవర్గాలు, 3 ఎంపీ స్థానాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఓటర్ల ఇబ్బంది లేకుండా ఆయా పోలింగ్‌ బూత్‌ల వద్ద షామియానాలు, నీటి సదుపాయం, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
– ఓటేద్దాం.. హక్కును రక్షించుకుందాం.

Similar News

News December 15, 2025

తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

image

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్‌ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్‌ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

News December 15, 2025

తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

image

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్‌ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్‌ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

News December 14, 2025

రాజమండ్రి: టెట్ పరీక్షల్లో 129 మంది గైర్హాజరు

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2025) ఐదవ రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు తెలిపారు. రాజమండ్రి లూధర్ గిరి‌లో ఉన్న రాజీవ్ గాంధీ కళాశాలలో మొదటి షిఫ్ట్‌లో 955 మందికి 895 మంది హాజరయ్యారని, 60 మంది గైర్హాజరు అయ్యారన్నారు. మధ్యాహ్నం రెండవ షిఫ్ట్‌లో 700 మందికి 631 మంది హాజరైనట్లు, 69 మంది గైర్హాజరు అయినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు.