News April 12, 2024
ఘోరం: తిండి పెట్టలేక భార్య, ఏడుగురు పిల్లలను చంపేశాడు

పాకిస్థాన్లో దారుణం జరిగింది. సజ్జాద్ ఖోఖర్ అనే కూలీ తన భార్య కౌసర్, ఏడుగురు పిల్లలను గొడ్డలితో నరికి చంపేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ప్రశ్నించగా, తన భార్య, పిల్లలకు తిండి పెట్టలేకే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వెల్లడించాడు. ఈ ఘటన సంచలనంగా మారడంతో పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ సంతాపం వ్యక్తం చేశారు. కాగా పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Similar News
News December 17, 2025
మెస్సీ వచ్చాడు.. మంత్రి పదవి పోయింది!

మెస్సీ టూర్తో దేశంలో ఓ మంత్రి పోస్ట్ ఊస్టింగ్ అయింది. కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం పర్యటన సందర్భంగా తీవ్ర <<18551215>>గందరగోళం<<>> తలెత్తిన విషయం తెలిసింది. దీంతో అందరిముందూ పరువు పోయిందంటూ బెంగాల్ CM మమత కన్నెర్రజేశారు. ఇంకేముంది ఘటనకు బాధ్యత వహిస్తూ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. దీన్ని ‘చాలా మంచి నిర్ణయం’ అని దీదీ పేర్కొనడం గమనార్హం. అయితే ఆయనను రాజీనామా చేయమన్నదే మేడమని మరో ప్రచారం.
News December 17, 2025
కౌలు రైతులకు రూ.లక్ష రుణం.. ఎవరు అర్హులు?

AP: కౌలు రైతులకు రూ. లక్ష వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలను పొందవచ్చు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అందించే ఈ రుణాలకు అర్హతను ఎలా నిర్ణయిస్తారు?, ఎవరికి ప్రాధాన్యం ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 17, 2025
తుది పోరు.. పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొన్నటి వరకు జోరుగా ప్రచారం చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది. నేటితో రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగియనుంది. అయితే రేపటి వరకు సెక్షన్ 136 అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.


