News November 5, 2025

GNT: తలచుకుంటే తల్లడిల్లే బీభత్సం..!

image

నేడు ప్రపంచ సునామీ దినోత్సవం. అయితే 2004 డిసెంబర్ 26న బంగాళాఖాతంలో వచ్చిన సునామీ ఆంధ్ర తీరాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తీర గ్రామాలు అతలాకుతమయ్యాయి. ఈ సునామీ వల్ల మొత్తం 301 గ్రామాలు నష్టపోగా, 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ సహాయ చర్యలు నెలల పాటు కొనసాగాయి.

Similar News

News January 14, 2026

మరో 9 అమృత్‌ భారత్‌ రైళ్లు.. ఏపీ మీదుగా వెళ్లేవి ఎన్నంటే?

image

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో నాలుగు రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు పరుగులు తీయనున్నాయి. ఖరగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు ఈ రైళ్లు కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ ట్రైన్లలో న్యూ జల్‌పాయ్‌గురి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే రైలు దేశంలోనే అతి పొడవైన రూట్లలో ఒకటిగా నిలవనుంది.

News January 14, 2026

సిరిసిల్ల: ప్రమాదాల నివారణకు సహకరించాలి: ఎస్పీ

image

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలను నివారణకు సహకరించాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గీతె అన్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంగళవారం రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపడం ద్వారా మీ ప్రాణాలే కాకుండా ఎదుటివారి ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారని ఆయన పేర్కొన్నారు.

News January 14, 2026

గుట్టన్న స్మారకమే ఆదివాసీ అమరుల స్థూపం!

image

మేడారంలో గద్దెల పునరుద్ధరణతో ఆదివాసీల చరిత్ర సరికొత్తగా తలెత్తుకుంది. ఇదే క్రమంలో కొన్ని నిర్మాణాలు, మార్పులు అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. ఇందులో ఒక్కటే ఊరట్టం స్థూపం. మేడారం సమీపంలోని ఎలుబాకకు చెందిన జనశక్తి పార్టీ నేత గుట్టన్న స్మారకార్థం నిర్మించారు. మంత్రి సీతక్క సూచనతో దానికి ఆకుపచ్చ, ఎరుపు రంగులు అద్ది ‘ఆదివాసీ అమరుల స్థూపం’గా నామకరణం చేశారు. నక్సలైట్‌గా సీతక్క జనశక్తి పార్టీ సభ్యురాలే.