News August 22, 2025

GNT: 1.03 లక్షల ఎకరాల్లో సాగు.. నీటమునిగిన 70 వేల ఎకరాలు

image

గుంటూరు జిల్లాలో మొత్తం 2.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు 1.33 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. అందులో 1.54 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా ఉండగా ఇప్పటికి 1.03 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవల అధిక వర్షాలకు 70 వేల ఎకరాల్లో వరి పైర్లు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వెదపద్ధతిలో సాగు చేసిన ఈ పైరు దెబ్బతినడంతో మళ్లీ పంట వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Similar News

News January 17, 2026

ANU: ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమం

image

ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారుల అవగాహన కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని OSD ఆచార్య రవికుమార్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ (ఇన్‌ఫ్లిబ్‌నెట్) సెంటర్, గాంధీనగర్, గుజరాత్, ఉన్నత విద్యా కమిషనరేట్ AP, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన వారు ఈ నెల 20వ తేదీలోగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News January 17, 2026

వైన్ షాపుల వద్దే పండుగ జరుగుతుంది: అంబటి

image

జగన్ పాలన తిరిగి వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. మంగళగిరి వైసీపీ కార్యాలయంలో శనివారం దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో సంస్థాగత కమిటీ నిర్మాణంపై సమావేశం‌ జరిగింది. రాష్ట్రంలో పండుగ అంటే వైన్ షాపులు దగ్గరే జరుగుతుందని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా పథకాలు అందేవని వాటితో వారు పండగలు నిర్వహించుకునేవారని అంబటి అన్నారు.

News January 17, 2026

GNT: కలెక్టర్‌ని కలిసిన జీఎంసీ కమిషనర్

image

గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ కె. మయూర్ అశోక్ శనివారం కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాను కలిశారు. కార్పొరేషన్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన కమిషనర్ కలెక్టర్‌ని కలిసి ఆమెకు మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ది, ఇతర కీలక అంశాలపై ఇరువురు చర్చించారు.