News September 11, 2025
10 లక్షల మంది రైతులకు గుడ్ న్యూస్

TG: భూభారతి చట్టం కింద సాదా బైనామా (నమోదు కాని లావాదేవీలు) క్రమబద్ధీకరణకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ వల్ల దాదాపు 10 లక్షల మంది రైతులు భూ యాజమాన్య హక్కులను పొందుతారని ప్రకటనలో తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, 2020లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు సమర్పించిన రైతుల సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని పేర్కొంది.
Similar News
News December 12, 2025
జట్టులో సూర్య, గిల్ అవసరమా?

T20ల్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నా కెప్టెన్, వైస్ కెప్టెన్ అనే కారణంతో సూర్య, గిల్ కంటిన్యూ అవుతున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గత 14 T20ల్లో గిల్ 263 పరుగులే చేశారని, అటు తన చివరి 20 మ్యాచుల్లో SKY కేవలం 227 రన్సే కొట్టారని చెబుతున్నారు. వీళ్ల కోసం ఫామ్లో ఉన్న శాంసన్, జైస్వాల్ బలవుతున్నారని SMలో పోస్టులు పెడుతున్నారు. వీరిని టీం నుంచి తొలగించాలనే డిమాండ్లు విన్పిస్తున్నాయి. దీనిపై మీ COMMENT.
News December 12, 2025
ప్రతి ఇంట్లో గంగా జలం ఎందుకు ఉండాలి?

ప్రతి ఇంట్లో గంగా జలం తప్పనిసరిగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల సానుకూల శక్తితో గృహంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని అంటున్నారు. ‘గంగాజలం ఎప్పటికీ పాడవదు. ఎన్నేళ్లైనా గంగాజలాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు. పూజలు, శుభకార్యాల సమయంలో ఉపయోగించవచ్చు. ఇల్లు కడిగేటప్పుడు, ఇంటికి సున్నం వేసే నీటిలో కొద్ది గంగా జలం వినియోగిస్తే.. ఏ ప్రతికూల శక్తి ప్రవేశించదు’ అని అంటున్నారు.
News December 12, 2025
చిలగడదుంపలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

శీతాకాలంలో దొరికే చిలగడదుంపలు పోషకాల పవర్ హౌస్ అని వైద్యులు చెబుతున్నారు. ‘వీటిలోని బీటా కెరోటిన్ కంటి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పెద్దమొత్తంలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. అలాగే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీర వాపులను, నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మనల్ని రక్షిస్తాయి’ అని అంటున్నారు.


