News March 5, 2025
స్కూలు విద్యార్థులకు శుభవార్త

AP: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 13 వరకు పొడిగించారు. గతంలో విధించిన గడువు రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో తాజాగా పొడిగించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోగా దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <
Similar News
News December 17, 2025
IPL మినీ వేలం.. అన్సోల్డ్ ప్లేయర్లు!

మెక్ గుర్క్, కాన్వే, అన్మోల్ ప్రీత్, అభినవ్ మనోహర్, యష్ ధుల్, కోయెట్జి, స్పెన్సర్ జాన్సన్, తీక్షణ, సిమర్జిత్ సింగ్, కర్ణ్ శర్మ, సకారియా, మురుగన్ అశ్విన్, KC కరియప్ప, తస్కిన్ అహ్మద్, అల్జారీ జోసెఫ్, రిచర్డ్సన్, అట్కిన్సన్, ముల్డర్, దీపక్ హుడా, విజయ్ శంకర్, లోమ్రోర్, తనుష్ కోటియన్, కమలేశ్ నాగర్కోటి, అబాట్, బ్రేస్ వెల్, శనక, డారిల్ మిచెల్, KS భరత్, గుర్బాజ్, బెయిర్ స్టో, జామీ స్మిత్ తదితరులు.
News December 17, 2025
ధోనీకి ఇదే చివరి IPL: ఊతప్ప

రానున్న IPL సీజనే ధోనీకి చివరిదని CSK మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నారు. ఆపై ఎడిషన్లో ఆడతారని తాను అనుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుతం జట్టు కూర్పు చూస్తే అదే అర్థమవుతోందన్నారు. ‘గతేడాది, తాజాగా జరిగిన మినీ వేలంలోనూ యంగ్ క్రికెటర్లపై CSK ఎక్కువగా ఖర్చు చేసింది. అలాగే రుతురాజ్, శాంసన్ వంటి సారథులు జట్టులో ఉన్నారు. ఈ క్రమంలో ధోనీ టీం నుంచి తప్పుకొని మెంటార్గా కొనసాగే అవకాశాలున్నాయి’ అని చెప్పారు.
News December 17, 2025
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

AP: రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో బుధవారం 10AMకు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకొని లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా 2 రోజుల కాన్ఫరెన్స్ జరగనుంది. తొలి రోజు 18నెలల పాలనపై సమీక్ష చేసుకొని కలెక్టర్లకు CM దిశానిర్దేశం చేయనున్నారు. 2వ రోజు జిల్లాల్లో ఉత్తమ పద్ధతులు అవలంభించిన కలెక్టర్ల ప్రజెంటేషన్లు, తదితర ప్రోగ్రాంలు ఉండనున్నాయి.


