News March 15, 2025
SRH అభిమానులకు గుడ్ న్యూస్

సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాసయ్యారు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన ఈ పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించారు. దీంతో ఆయన రేపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆయన గాయపడ్డారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పక్కటెముకల గాయానికి గురయ్యారు. అప్పటినుంచి ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నారు.
Similar News
News February 13, 2026
గెలిచిన మా అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం: KTR

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులతో బెదిరిస్తున్నారని BRS నేత కేటీఆర్ ఆరోపించారు. గద్వాలలోని ఓ వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ చేయించి కాంగ్రెస్ అభ్యర్థిని ఒక ఓటుతో గెలిపించుకున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట, చౌటుప్పల్లోనూ ఇలాగే చేశారని చెప్పారు. 16 మున్సిపాలిటీల్లో నేరుగా గెలుస్తున్నామని, మరో 10-15 చోట్ల BRS లార్జెస్ట్ పార్టీ అని తెలిపారు.
News February 13, 2026
నీట్ ర్యాంకులతో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు

AP: నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని GOVT నిర్ణయించింది. గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET పెట్టారు. అయితే 16000 సీట్లకు గాను 4000 మిగిలిపోయాయి. దీంతో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తాజా ప్రతిపాదనలు సమర్పించగా CM ఆమోదించారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకొనే వారు 2026-27 నుంచి నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది.



