News May 15, 2024
ఓటర్ల కోసం రైలుకు గ్రీన్ ఛానల్

ఎన్నికల అధికారుల చొరవతో దాదాపు వెయ్యి మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 12న నాందేడ్ నుంచి విశాఖ వస్తున్న రైలు ఆలస్యంగా నడిచింది. పోలింగ్కు దూరమవుతామని ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో ఎన్నికల సంఘం రైలు ఎక్కడా ఆపకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటుచేయించారు. దీంతో రా.8 తర్వాత విశాఖ చేరుకోవాల్సిన ట్రైన్ సా.5.15కే చేరుకోవడంతో కొందరు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు.
Similar News
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


