News November 19, 2025
GWL: గద్వాల ఖ్యాతి నిలిచేలా ప్రతిభ చాటాలి

జిల్లాస్థాయి యువజన ఉత్సవాల్లో ప్రథమ స్థానం సాధించిన కళాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని గద్వాల జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బాలభవన్లో వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు. యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివేకానంద స్ఫూర్తితో గమ్యం చేరుకోవాలని అన్నారు.
Similar News
News January 22, 2026
దెందులూరు: బ్రిడ్జి నిర్మాణంపై చింతమనేని సూచనలు

దెందులూరు నియోజకవర్గంలో నూతన రోడ్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. కొక్కిరపాడు నుంచి దాసరిగూడెం వెళ్లే మార్గం, పెదపాడు మండలంలోని వట్లూరు సహా పలు ప్రాంతాల్లో ఆర్ఓబి, ఆర్ యు బిల నిర్మాణాలు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి, జేసి, తదితరులు పాల్గొన్నారు.
News January 22, 2026
ఆర్ఓబీలతో ట్రాఫిక్ కష్టాలకు చెక్: కలెక్టర్

రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఏలూరు జిల్లాలో రోడ్డు ROBల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఏలూరు, దెందులూరు, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల పరిధిలోని 27 పెండింగ్ పనులపై ఆమె చర్చించారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
News January 22, 2026
గవర్నర్లు VS రాష్ట్ర ప్రభుత్వాలు

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్లు VS రాష్ట్ర ప్రభుత్వాలుగా పరిస్థితి మారింది. TNలో RN రవి, కర్ణాటకలో థావర్ చంద్ అక్కడి ప్రభుత్వాలు రూపొందించిన ప్రసంగ పాఠాలను చదవడానికి నిరాకరిస్తూ సభనుంచి వెళ్లిపోయారు. అటు తామిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ రాజేంద్ర మార్చారని కేరళ CM విజయన్ ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న STATESలో ఇవి దుమారాన్ని రేపుతున్నాయి. కాగా గవర్నర్ తీరుపై SCకి వెళ్లాలని కర్ణాటక నిర్ణయించింది.


