News April 14, 2025
GWL: బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్: SP

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి కుల వ్యవస్థను ఎదుర్కొంటూ ఉన్నత విద్యను అభ్యసించి, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా ఎదిగాడని ప్రశంసించారు.
Similar News
News April 24, 2025
నిర్మల్: మండిపోతున్న ఎండలు

నిర్మల్ జిల్లా బుధవారం అగ్నిగుండంగా మారింది. అధికారులు వెల్లడించిన ఉష్ణోగ్రతల ప్రకారం 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు. తీవ్ర ఉక్కుపోత వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటలలోపే భరించలేని ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు అధికారులు ఎండల తీవ్రతపై ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News April 24, 2025
MBNR: ‘భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలి’

జిల్లాలో భూగర్భ జిల్లాలో అడుగంటకుండా వాటిని పెంచేందుకు వర్షపు నీటి సంరక్ష నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో నీటి నియంత్రణపై ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలో పలు సూచనలు చేశారు. నీటి సంరక్షణ పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు అందరికీ అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు.
News April 24, 2025
నిర్మల్: తల్లిదండ్రులను కోల్పోయిన ఆగని లక్ష్యం

ఖానాపూర్ మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల కళాశాల విద్యార్థిని తోకల ముత్తవ్వ అలియాస్ సుప్రియ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. BiPC ప్రథమ సంవత్సరంలో 429 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు లేకపోయినా పిన్ని, బాబాయిల సహకారంతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కష్టపడి చదివినట్లు తెలిపింది. డాక్టర్ కావడమే తన లక్ష్యమని పేర్కొంది. సరూర్నగర్లోని COEలో సీటు సాధించడంతో ప్రస్తుతం నీట్ శిక్షణ పొందుతోంది.