News August 21, 2025
GWL: లీగల్ ఎయిడ్ సేవలు వినియోగించుకోవాలి

వయోవృద్ధులు లీగల్ ఎయిడ్ సేవలు వినియోగించుకోవాలని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజేందర్ పేర్కొన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినాన్ని పురస్కరించుకొని గద్వాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో వయోవృద్ధులకు న్యాయ సలహాలు గురించి అవగాహన కల్పించారు. వయోవృద్ధుల చట్టాలు, చట్టపరమైన ఇబ్బందులు, పెన్షన్, తదితర సమస్యల పరిష్కారం గురించి వివరించారు.
Similar News
News January 23, 2026
గంగాపూర్ జాతరలో సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

రెబ్బెన(M) గంగాపూర్ గ్రామంలో జరగనున్న బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతర మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం గంగాపూర్ గ్రామాన్ని సందర్శించి జాతర మహోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సర్పంచ్, ఇతర అధికారులతో సమీక్షించారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
News January 23, 2026
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు ప్రతిజ్ఞ

ఓటు ప్రాధాన్యం గురించి ప్రతిఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరముందని, 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ASF కలెక్టర్ హరిత సూచించారు. ASF కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందితో కలెక్టర్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News January 23, 2026
ఓటు హక్కు వజ్రాయుధం: కలెక్టర్

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన వజ్రాయుధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత గల పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్
వి. పాటిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. దేశంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందన్నారు.


