News August 14, 2025
GWL: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

గద్వాల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రేపు జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరుకావాలని కలెక్టర్ సంతోష్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి హాజరై ఉదయం 9:30 గంటలకు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు.
Similar News
News March 6, 2026
రేపు 11:01AMకి ‘ధురంధర్-2’ ట్రైలర్

ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ధురంధర్-2’ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈసారి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. కాగా ‘ధురంధర్’ తొలి పార్ట్ ఏకంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
News March 6, 2026
ప్రారంభమైన మహా కుంభాభిషేక మహోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం కనకదుర్గానగర్ ప్రవేశద్వారం నుంచి పవిత్ర కలశాలతో అర్చకులు, వేదపండితులు ఇంద్రకీలాద్రికి చేరుకునే కలశ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు.
News March 6, 2026
HYDలోని మరో ఆఫీస్కు బాంబు బెదిరింపు

బేగంపేట వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. 14 బాంబులు అమర్చామని, మధ్యాహ్నం వరకు అవి పేలుతాయని ఈమెయిల్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధాన భవనం సురక్షితమని అధికారులు తేల్చారు. ఇటీవల వరుసగా కోర్టులకు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.


