News March 27, 2024
హరీశ్, ఎర్రబెల్లిని అరెస్ట్ చేయాలి: రఘునందన్

TS: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, ఎర్రబెల్లిని అరెస్టు చేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ‘మునుగోడులో రాజగోపాల్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం. ట్యాపింగ్ తొలి బాధితుడు సీఎం రేవంత్. రెండో బాధితుడిని నేనే. హైకోర్టు జడ్జిలు, హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఈ కేసులో కేసీఆర్ను, హరీశ్ను తొలి ఇద్దరు ముద్దాయిలుగా చేర్చాలి. కేసును సీబీఐకి అప్పగించాలి’ అని స్పష్టం చేశారు.
Similar News
News February 11, 2026
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోయి 84,163 వద్ద.. నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 25,921 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, టైటాన్, మారుతీ, SBI షేర్లు లాభాల్లో.. HCL టెక్, ట్రెంట్, TCS, ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలకు దిగుతున్నారు.
News February 11, 2026
బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

బీట్ రూట్లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.
News February 11, 2026
DRDOలో 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


