News May 2, 2024

టీడీపీ పిటిషన్‌పై విచారణ సాయంత్రానికి వాయిదా

image

AP: స్వతంత్ర అభ్యర్థులకు జనసేన గ్లాసు గుర్తు కేటాయించడంపై టీడీపీ దాఖలు చేసిన <<13162957>>పిటిషన్‌పై <<>>హైకోర్టు విచారించింది. జనసేనకు తప్ప రాష్ట్రంలో ఇంకెవరికీ ఈ గుర్తు కేటాయించవద్దని టీడీపీ కోరగా.. ఎన్నికల ప్రక్రియ ఏ దశలో ఉందో చెప్పాలని ఈసీని కోర్టు ఆదేశించింది. అటు తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు న్యాయస్థానం వాయిదా వేసింది.

Similar News

News December 11, 2025

బంగ్లాదేశ్‌కు చైనా ఫైటర్ జెట్లు.. భారత్‌కు ముప్పు?

image

బంగ్లాదేశ్‌కు 20 అత్యాధునిక J-10C ఫైటర్ జెట్లను సప్లై చేసేందుకు 2.2 బిలియన్ డాలర్ల డీల్‌కు చైనా అంగీకరించింది. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యూనుస్ చైనా నుంచి సబ్‌మెరైన్లు, ఆయుధ సామగ్రి కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో భారత్‌కు బంగ్లా నుంచి ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం ఇస్తుండడంతో భారత్‌-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

News December 11, 2025

చలి పంజా.. బయటికి రావద్దు!

image

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. TGలో ఇవాళ రాత్రికి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠానికి పడిపోతాయని TG వెదర్‌మ్యాన్ తెలిపారు. HYD సహా జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుందన్నారు. ఉమ్మడి ADB, NZB, WGL, MDK జిల్లాలకు IMD రేపటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఆంధ్రాలో ఈ వారమంతా చలిగాలులు కొనసాగుతాయని AP వెదర్‌మ్యాన్ తెలిపారు. అరకు, వంజంగి, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలకు పడిపోయాయి.

News December 11, 2025

SHOCKING: వీర్యదాత వల్ల 197 మందికి క్యాన్సర్ ప్రమాదం

image

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే TP53 జన్యు మ్యుటేషన్ ఉన్న విషయం తెలియని వ్యక్తి దానం చేసిన వీర్యం ద్వారా యూరప్‌లో 197 మంది పిల్లలు పుట్టారు. 2005 నుంచి అతను వీర్యదాతగా ఉన్నారు. ఈ వీర్యాన్ని సరఫరా చేసిన డెన్మార్క్‌కు చెందిన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ బాధిత కుటుంబాలకు తాజాగా సారీ చెప్పింది. ఈ పిల్లల్లో కొందరు ఇప్పటికే క్యాన్సర్‌తో మరణించారు. మిగతావారికీ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని వైద్యులు తెలిపారు.