News May 2, 2024
ఇద్దరు BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

TG: మేడ్చల్, జనగామ BRS MLAలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు సమాధానం చెప్పాలని తదుపరి విచారణను జూన్కు వాయిదా వేసింది. బ్యాంక్ ఖాతా లేకపోయినా IT రిటర్న్స్ ఎలా దాఖలు చేశారని మల్లారెడ్డి ఎన్నికను కాంగ్రెస్ నేత వజ్రేశ్ సవాల్ చేశారు. జనగామ MLA పల్లా ఎన్నికపై కొమ్మూరి ప్రతాప్రెడ్డి పిటిషన్ వేశారు.
Similar News
News December 7, 2025
పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్లో KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹260గా ఉంది. వరంగల్, కామారెడ్డిలోనూ ఇవే రేట్లున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, చిత్తూరులో ₹240-260, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ₹220-230 వరకు పలుకుతోంది. ఇక మటన్ కేజీ ₹800-900 వరకు అమ్ముతున్నారు. కోడిగుడ్డు ధర రిటైల్లో ఒక్కోటి ₹7-9కి అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
News December 7, 2025
రాష్ట్రంలో 94 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణలో 94 Jr జడ్జీ పోస్టుల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిలో 66 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, 28 పోస్టులను ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేయనున్నారు. LLB ఉత్తీర్ణతతో పాటు బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు చేసుకున్నవారు DEC 29వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 23- 35ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వోస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: tshc.gov.in
News December 7, 2025
మీ తోబుట్టువును గౌరవిస్తున్నారా?

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బానధవా|
తం తు దేశం న పశ్యామి యత్ర బాత్రా సహోదరా||
సహోదరుల బంధం గురించి రాముడు పలికిన మాటలివి. ఈ బంధం విశ్వంలో ఎక్కడా దొరకనంత అమూల్యమైనదని దీనర్థం. సోదరులతో చిన్న మనస్పర్ధలు వచ్చినా, సరిచేసుకుని కలిసి ఉండాలి. ఎక్కడికెళ్లినా భార్యలు, బంధువులు దొరుకుతారు కానీ, తోబుట్టువు దొరకరు. అందుకే ఈ బంధాన్ని దేంతో పోల్చలేము. అంత అపురూపమైనది. ఈ బంధాన్ని ఎల్లప్పుడూ గౌరవించుకోవాలి.


