News April 21, 2024

3 రోజుల్లో ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 65 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మూడు రోజుల్లో నామినేషన్ల సంఖ్య 164కు చేరింది. ఇంకా ఆదిలాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కాగా నామపత్రాలు దాఖలు చేసేందుకు ఆదివారం సెలవు దినంగా ఈసీ గతంలోనే ప్రకటించింది.

Similar News

News December 17, 2025

చిన్నతనంలో ఊబకాయం రాకూడదంటే..!

image

చిన్నారుల్లో ఊబకాయం రాకూడదంటే శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. పిల్లలు ఔట్ డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా పిల్లలు బరువు పెరగవచ్చు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 8-9 గంటలు నిద్రపోయేలా టైమ్ టేబుల్ సెట్ చేయండి. పిల్లల్లో ఊబకాయాన్ని నివారించడానికి, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

News December 17, 2025

మూడో నేత్రం తెరుద్దామా?

image

శివుడికే కాదు మనక్కూడా 3 నేత్రాలు ఉంటాయి. నుదిటిపై కుంకుమ ధరించడం వల్ల ఆ నేత్రాన్ని తెరవొచ్చని పండితులు చెబుతున్నారు. ‘మన శరీరంలో 7 శక్తి చక్రాలు ఉంటాయి. అందులో మూడోది నుదిటిపై ఉంటుంది. అక్కడ కుంకుమ ధరిస్తే మూడో చక్రం ఉత్తేజితమవుతుంది. అది మన ఆత్మ శక్తిని పెంచుతుంది. అయితే అమ్మాయిలు ప్లాస్టిక్‌తో చేసిన కృత్రిమ బిందీ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవట. పాజిటివ్ ఎనర్జీకై సహజ కుంకుమను వాడుదాం.

News December 17, 2025

1,785 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>సౌత్<<>> ఈస్ట్రన్ రైల్వేలో 1,785 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపి‌క చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.rrcser.co.in/