News April 13, 2024

ఏ పార్టీ ఏలుబడిలో ఎంతమంది!

image

భారతదేశ జనాభా దాదాపు 142.86 కోట్లుగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో.. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ప్రజల్ని పాలిస్తున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ప్రజల్ని BJP పరిపాలిస్తోంది. జనాభాలో 42.5% మంది BJP ఏలుబడిలో ఉన్నారు. జనతాదళ్(యు) 9.1%, శివసేన 9%, కాంగ్రెస్ 8.3%, TMC 7.3%, DMK 5.7%, YCP 3.9%, AAP 3.6%, బిజూ జనతా దళ్ 3.4%, ఝార్ఖండ్ ముక్తి మోర్చా 2.8% మంది ప్రజల్ని పరిపాలిస్తోంది.

Similar News

News December 7, 2025

రోహిత్ శర్మ మరో 984 పరుగులు చేస్తే..

image

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లలో రోహిత్ శర్మ(20,048) 13వ స్థానంలో ఉన్నారు. Top10లో నిలవాలంటే ఇంకా 984 రన్స్ చేయాలి. ప్రస్తుతం పదో స్థానంలో జయసూర్య(21,032) కొనసాగుతున్నారు. 11, 12 స్థానాల్లో ఉన్న చందర్‌పాల్, ఇంజమామ్ రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో టాప్ 10లోకి ఎంటరయ్యే ఛాన్స్ రోహిత్‌కు ఉంది. 2027 ODI WC వరకు ఆడితే ఇది సాధ్యమేనని క్రికెట్ విశ్లేషకుల అంచనా.

News December 7, 2025

NDMAలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (<>NDMA<<>>) 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(ఫారెస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, రిమోట్ సెన్సింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, అట్మాస్పియరిక్ సైన్స్, జియోగ్రఫీ), ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ndma.gov.in./

News December 7, 2025

అత్యాచార బాధితుల కోసం ఓ యాప్

image

ప్రస్తుతకాలంలో చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. వీటితో పిల్లలకు ఎంతో మనోవ్యధ కలుగుతోంది. దీన్ని తగ్గించడానికి కేంద్రం POCSO e-box యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నేరస్తులకు శిక్ష పడే వరకు ఈ యాప్ సేవలు అందిస్తుంది. ఈ యాప్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కేసు అప్డేట్స్ కూడా ఇందులో తెలుసుకొనే వీలుంటుంది.