News December 11, 2024
వచ్చే మ్యాచ్కు పిచ్ ఎలా ఉంటుందంటే…
BGTలో మూడో మ్యాచ్ బ్రిస్బేన్లో జరగనుంది. చివరిగా ఈ గ్రౌండ్లో ఆడినప్పుడు భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పిచ్ వేగంగా ఉంటుందని దాని క్యూరేటర్ తాజాగా తెలిపారు. ‘ప్రత్యేకించి వేగవంతమైన పిచ్నేమీ మేం తయారుచేయలేదు. బౌన్స్ బాగుండేలా చూస్తున్నాం అంతే. సంప్రదాయంగా గబ్బా ఎప్పుడూ ఫాస్ట్ వికెట్టే’ అని వెల్లడించారు. గత మ్యాచ్లో ఆసీస్ గెలవడంతో BGTలో ఇరు జట్లూ సమానంగా ఉన్నాయి.
Similar News
News January 18, 2025
ఇంగ్లండ్తో వన్డే సిరీస్కూ అదే జట్టు.. కానీ
ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన 15 మంది సభ్యుల <<15185531>>జట్టే<<>> ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్లోనూ పాల్గొంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపారు. కానీ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా వస్తారని వెల్లడించారు. అయితే తొలి రెండు వన్డేలకు బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగే మూడో వన్డే నుంచి అతడు జట్టులోకి వచ్చి, CTలోనూ పాల్గొంటారని తెలుస్తోంది.
News January 18, 2025
అనుమానాలు పటాపంచలు.. CTలో బుమ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అనుమానమేనన్న వార్తలకు తెరపడింది. ఇవాళ అతని పేరును సెలక్టర్లు ప్రకటించారు. దీంతో స్టార్ బౌలర్ కోలుకున్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది. BGTలో భారత బౌలింగ్ దళాన్ని బుమ్రా ఒంటి చేత్తో ముందుకు నడిపించిన విషయం తెలిసిందే. ట్రోఫీ కోల్పోయినప్పటికీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నారు.
News January 18, 2025
రాయలసీమను రతనాల సీమగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
AP, కేంద్రంలో NDA ప్రభుత్వం ఉండటం వల్లే అమరావతి, పోలవరం పనులు ముందుకెళ్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లూ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ తీరిపోతున్నాయని చెప్పారు. మైదుకూరులో మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా చేయడమే తన లక్ష్యమన్నారు. గోదావరి-పెన్నా, పోలవరం-బనకచర్ల అనుసంధానమైతే గేమ్ఛేంజర్ అవుతుందని పేర్కొన్నారు.