News March 28, 2024
HYD:రంజాన్ వేళ.. డ్రై ఫ్రూట్స్కు FULL డిమాండ్

రంజాన్ వేళ HYD నగరంలో డ్రై ఫ్రూట్స్కు డిమాండ్ పెరిగింది. HYD దేశంలోనే ఖర్జూరాలను అధికంగా అవిక్రయించే నగరంగా పేరుగాంచింది. ఏటా సుమారు 400 ట్రక్కుల ఖర్జురాలను విక్రయిస్తారు. దాదాపు బేగంబజార్లో 40 రకాల ఖర్జూరాలు విక్రయిస్తుండగా.. కిమియా , షికారి, కూద్రి, మజాపాతి, కాల్మీ ప్రసిద్ధిగాంచినవి. మరోవైపు అమెరికా, అరబ్ దేశాల నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి HYD నగరానికి డ్రై ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి.
Similar News
News February 19, 2026
ఈస్ట్ HYDకు ‘కిక్’.. రూ.25 కోట్లతో భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్..!

నగర తూర్పు దిక్కున ఇక ఆటల జాతర షురూ కాబోతోంది. ఉప్పల్, శివారు ప్రాంతాల రూపురేఖలు మార్చేలా 10ఎకరాల విస్తీర్ణంలో రూ.25కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్తో పాటు అంతర్జాతీయ స్థాయి వసతులూ రానున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఈస్ట్ HYD స్పోర్ట్స్ హబ్గా మారడమే కాకుండా, స్థానిక రియల్ ఎస్టేట్కు మంచి బూస్ట్ లభించనుంది.
News February 19, 2026
నార్సింగి: దారుణం.. గంజాయి తాగించి బాలికపై గ్యాంగ్ రేప్

నార్సింగి PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికకు ముగ్గురు రౌడీషీటర్లు బలవంతంగా గంజాయి తాగించారు. ఆపై మత్తులో తనపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులు ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిది నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీ అని సమాచారం.
News February 19, 2026
HYD: SMలో పోస్టులు పెట్టకపోతే బతికేదేమో..?

వనస్థలిపురంలో గర్భిణిని మాజీ భర్త చంపడానికి ప్రధాన కారణం SMలో పెట్టిన ఫొటోలేనా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. మహారాష్ట్రకు చెందిన సునీత, పెద్దపల్లివాసి మహేశ్ 2022లో పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో 2024లో విడిపోయారు. ఆపై HYDలో పరిచయమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనాథ్ను సునీత రెండో వివాహం చేసుకుని తానిప్పుడు హ్యాపీగా ఉన్నట్లు SMలో పోస్ట్ చేసింది. ఇదిచూసి రగిలిపోయిన మహేశ్ <<19175503>>మాజీ భార్యను నరికి చంపాడు.<<>>


