News January 10, 2026
HYDలో కరీంనగర్ యువకుడి ఆత్మహత్య

ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన అనుదీప్ ఓ ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News January 13, 2026
పరకాల: బీజేపీలో బహిర్గతమైన అంతర్గత విభేదాలు!

సోమవారం పరకాల పట్టణంలో జరిగిన బీజేపీ మున్సిపల్ సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతుండగానే బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, బూతులు తిట్టుకోవడంతో సమావేశం ఒక్కసారిగా అస్తవ్యస్తమైంది. పరకాల పట్టణానికి చెందిన ఓ నాయకుడి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్న వ్యాఖ్యలతో వివాదం ముదిరింది. పార్టీ శ్రేణులు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది.
News January 12, 2026
ములుగు: యంగ్ ఇండియా స్కూల్స్, మున్సిపల్ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ములుగు నుంచి జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. నిర్మాణాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు.
News January 12, 2026
ప్రజావాణిలో 129 వినతులు స్వీకరణ: వరంగల్ కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. మొత్తం 129 దరఖాస్తులు అందగా వాటిలో రెవెన్యూ సంబంధిత 52 ఉన్నాయి. భూ సమస్యలు, పింఛన్లు, గృహాలు, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.


