News October 8, 2024
HYDలో రేపు MLA KVR ప్రెస్ మీట్

HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలియజేశారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News January 16, 2026
నిజామాబాద్లో కొండెక్కిన చికెన్ ధరలు

నిజామాబాద్లో చికెన్ ధరలు కొండక్కాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 320 ఉండగా, స్కిన్ చికెన్ 300గా ఉంది. లైవ్ చికెన్ లైవ్ చికెన్ రూ.260 గా ఉంది. చేపలు రవాటాలు కిలో రూ.200 ఉండగా, మొట్ట చేపలు రూ.700 కిలోకు విక్రయిస్తున్నారు. అయితే సంక్రాంతి కనుమ పండుగ కావడంతో అధిక మొత్తంలో మాంసం తినడం ఆచారంగా వస్తోంది. మాంసం కొనేందుకు సైతం అధిక ఆసక్తి కనబడుతున్నారు.
News January 16, 2026
UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.
News January 16, 2026
నిజామాబాద్: ఆపరేషన్ సింధూర్, పుష్ప పతంగుల జోరు

నిజామాబాద్ లో సంక్రాంతి సందర్భంగా ఆపరేషన్ సింధూర్, పుష్ప పతంగులు సందడి చేశాయి. ప్రత్యేకంగా ఈ కైట్లు ఎగురవేసేందుకు పిల్లలు యువత ఆసక్తి చూపించారు. ఎటు చూసినా ఆపరేషన్ సిందూర్ కైట్లే కనిపించాయి. మోదీ భద్రత దళాలతో ఉన్న ఫోటో కైట్ పై ఆకట్టుకుంటుంది. ఆపరేషన్ సిందూర్, పుష్ప రెండు ఎంత సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇపుడు సంక్రాంతి కైట్లలో కూడా పాపులర్ అయ్యాయి.


