News September 13, 2025
HYD: అనుమతి లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపడితే చర్యలు: కమిషనర్

శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలని GHMC కమిషనర్ కర్ణన్ సూచించారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ విభాగంపై సమీక్షించారు. అక్సుపెన్సీ సర్టిఫికెట్లు, కోర్టు కేసులు, ప్రజాఫిర్యాదులు, LRS దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. భవన నిర్మాణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. అనుమతుల్లేకుండా సెల్లార్ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు.
Similar News
News December 6, 2025
జగిత్యాల: ‘ప్రజా భద్రతలో హోం గార్డులది కీలక పాత్ర’

జిల్లా పోలీస్ కార్యాలయంలో 63వ హోం గార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్లో ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ట్రాఫిక్, ఎన్నికలు, నైట్ పెట్రోలింగ్, నేర నిరోధం, విపత్తు నిర్వహణలో హోం గార్డుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. కళాబృందం అవగాహన కార్యక్రమాలను అభినందించారు. హోం గార్డుల సంక్షేమం కోసం భత్యాల పెంపు, బీమా, రెయిన్ కోట్లు, జాకెట్లు పంపిణీ చేశారు. ఉత్తమ సిబ్బందికి బహుమతులు అందజేశారు.
News December 6, 2025
ప్రైవేటు బిల్లులు.. చట్టాలుగా మారుతాయా?

సాధారణంగా పార్లమెంటులో మంత్రులు బిల్లులను ప్రవేశపెడతారు. కానీ ఏదైనా తీవ్రమైన అంశం చట్టంగా మారాలని భావిస్తే ఎంపీలూ <<18487853>>ప్రైవేటు<<>> బిల్లులను ప్రతిపాదించవచ్చు. దీనికి ఒక నెల ముందు స్పీకర్, ఛైర్మన్కు నోటీసు ఇవ్వాలి. 1952 నుంచి 300కు పైగా ప్రైవేటు బిల్లులు సభ ముందుకు వచ్చాయి. అయితే 14 బిల్లులే చట్టాలుగా మారాయి. వాటిలో ముస్లిం వక్ఫ్, ఇండియన్ రిజిస్ట్రేషన్, హిందూ వివాహం(సవరణ), IPC(సవరణ) బిల్లులు ముఖ్యమైనవి.
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్: రూ.250 లక్షల కోట్లే లక్ష్యం!

భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కేవలం పెట్టుబడుల సమావేశం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక విధానాల విప్లవం. 2047 నాటికి $3 ట్రిలియన్ (సుమారు ₹250 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ దిశగా ముఖ్యమంత్రి ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ సారాంశమే ఈ సమ్మిట్. తయారీ, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పటిష్ఠమైన, స్థిరమైన నూతన పాలసీలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.


