News April 21, 2024
HYD: ఆదివారం ఆస్తి పన్ను వసూలు

ఎర్లీబర్డ్ పథకం కింద ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని, నెలాఖరుతో పథకం ముగుస్తున్నందున ఆదివారం పన్ను వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయని ఆయన వెల్లడించారు.
Similar News
News December 16, 2025
IDPL ల్యాండ్స్ వివాదంపై సర్కారు విచారణకు ఆదేశం

IDPL ల్యాండ్స్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4000 కోట్ల రూపాయల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంచలనంగా మారిన ఈ వివాదంలో తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత పరస్పరం భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ సర్వే నెంబర్ 376లో జరిగిన భూవివాదాలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
News December 16, 2025
HYD: ‘చే’ చివరిపోరుకు ‘బొలీవియా డైరీ’ రూపం

‘బొలీవియా డైరీ’లో చేగువేరా చివరి రోజులు, గెరిల్లా పోరాటం, <<18569067>>విప్లవంపై<<>> ఆయన అచంచల నిబద్ధత.. హృదయాన్ని ఇందులోని అక్షరాలు కదిలిస్తాయి. ఆకలి, వ్యాధులు, ద్రోహం, అపజయాల మధ్య వెనకడుగు వేయని విప్లవ ఆత్మ ప్రతి పుటలో ఉప్పొంగుతుంది. విజయానికి మించిన సిద్ధాంత విశ్వాసమే చేగువేరా జీవన తత్వంగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం పర్సనల్ డైరీ కాదు.. ప్రపంచ విప్లవ చరిత్రలో ఒక అమర పుట. ఇది యువతను ఆలోచింపజేసే రచన.
News December 16, 2025
డేంజర్లో హైదరాబాద్

హైదరాబాదులో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరుకుంది. ఎయిర్ పొల్యూషన్, చెత్తాచెదారం, పొగ మంచు, వాహనాల పొగ కారణంగా ఎయిర్ క్వాలిటీ క్షీణిస్తోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్లోకి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 220 ఎయిర్ క్వాలిటీ ఉంది. అంటే చాలా మంది జనాలు అనారోగ్య బారిన పడటమే కాకుండా ఆస్తమా వాళ్లకు ప్రాణ ముప్పు ఉంటుంది.


