News August 13, 2025
HYD: ఇస్రో ఛైర్మన్కు డాక్టరేట్: VC కుమార్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రకటించింది. ఈనెల 19న జరగనున్న ఓయూ 84వ స్నాతకోత్సవంలో ఓయూ కులపతి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ (డాక్టరేట్ ఆఫ్ సైన్స్) అందించనున్నట్లు ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం తెలిపారు. ఇస్రో ఛైర్మన్కు డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.
Similar News
News March 6, 2026
HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్ఫాం వేదమందిర్కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <
News March 6, 2026
HYD: నీరు వృథా.. ఖజానా ఖాళీ!

జలమండలిని ఇప్పుడు ‘నాన్-రెవెన్యూ వాటర్’ (NRW) భూతం వేధిస్తోంది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో దాదాపు 40% లీకేజీలు, అక్రమ కనెక్షన్ల ద్వారా వృథా అవుతుండటంతో బోర్డు దివాలా తీసే స్థితికి చేరింది. అటు సుంకేసుల ఇన్-టేక్ వెల్ వద్ద సాంకేతిక సమస్యల భయం వెంటాడుతుంటే ఇటు కొండాపూర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో తాగునీటిలో మురుగు కలుస్తోందన్న ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి.
News March 5, 2026
HYDలో ఇక ‘RED’ నోటీసులు

ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఇప్పుడు ట్యాక్స్ బాకీదార్లపై కన్నెర్ర చేస్తోంది. ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో ‘రెడ్ నోటీసుల’ పర్వం మొదలైంది. గడువు దాటితే సెక్షన్ 269 ప్రయోగించి ఆస్తుల జప్తుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే వెయ్యి కోట్ల బకాయి ఉండటం. ఈ నిధులు రాకపోతే వరద నివారణ, రోడ్ల మరమ్మతు పనులు గంగలో కలవడం ఖాయమనే విమర్శలొస్తున్నాయి.


