News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 18, 2026
నెల్లూరు: 9లక్షలకు పైగానే ఫ్రీ బస్ ఎక్కారు..!

సంక్రాంతి కావడంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడాయి. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టాక వచ్చిన తొలి సంక్రాంతి కావడంతో మహిళలు సొంతూళ్లకు ఉచితంగా ప్రయాణం చేశారు. ఈనెల 8 నుంచి 16వ వరకు నెల్లూరు జిల్లాలోని 7 డిపోల పరిధిలో 9,55,083 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. ఇందుకు గాను ప్రభుత్వంపై రూ.3,89,85,130 భారం పడింది.
News January 18, 2026
పుష్ప-3 ఉంటుందా? ఉత్తి హైపేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ వేర్వేరు సినిమాలతో బిజీ అయ్యారు. దీంతో పుష్ప-3 ఉంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. కేవలం హైపేనా? అంటూ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సుకుమార్ టీమ్ వాటిని కొట్టిపారేసింది. మూవీ కచ్చితంగా ఉంటుందని చెప్పింది. డైరెక్టర్, హీరో ఇతర ప్రాజెక్టుల్లో బిజీ అయినా.. టైమ్ దొరికినప్పుడల్లా కథ, స్క్రిప్ట్పైన వర్క్ చేస్తున్నట్లు చెప్పింది.
News January 18, 2026
అన్నమయ్య జిల్లాలో అద్భుత దృశ్యం

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం ఆదివారం ఉదయం ఆవిష్కృతమైంది. ఏటా కార్తీక మాసం, మాఘమాసంలో భానుడి కిరణాలు శివలింగాన్ని తాకుతాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు. స్వామివారికి అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున పూజలు, అభిషేకాలు చేశారు.


