News November 6, 2025

HYD: కార్తీక దీపాల మంటల్లో బాలిక దుర్మరణం

image

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో కార్తీక పౌర్ణమి వేళ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్‌ఎల్ నగర్‌వాసి మధుసూదన్ రెడ్డి కూతురు సాయి నేహారెడ్డి (7) ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో తన దుస్తులకు మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సైనిక్‌పురి అంకురా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కార్ఖానాలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది.

Similar News

News January 20, 2026

HYD: ట్రాఫిక్ పోలీసుల సేఫ్టీ.. స్టైలిష్ లుక్!

image

రోడ్లపై నిలబడి ఎండ, ధూళితో కుస్తీ పట్టే మన ట్రాఫిక్ అన్నలకు ఇప్పుడు అదిరిపోయే రక్షణ దొరికింది. సైబరాబాద్ జాయింట్ CP గజరావు భూపాల్ చేతుల మీదుగా సిబ్బందికి స్పెషల్ గాగుల్స్ పంపిణీ చేశారు. ఎండ వేడిమి, కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకుంటేనే, పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీసులు హెల్తీగా, స్టైలిష్‌గా డ్యూటీ చేయబోతున్నారు.

News January 20, 2026

రియల్ ఎస్టేట్ జాతకాన్ని మార్చేయబోతున్న గోదావరి!

image

‘ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ సిరి ఉంటుంది’ అనే సామెత ముత్తంగి, ఘన్‌పూర్ బెల్ట్‌లో నిజం కాబోతోంది. రూ.2,400 కోట్లతో ప్యాకేజీ-2 పనులు మొదలవ్వగానే ఆ ఏరియా అంతా ఇన్వెస్ట్‌మెంట్లకు అడ్డాగా మారనుంది. IT కారిడార్‌కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాల్లో నీటి భద్రత లభించడంతో భూముల ధరలకు రెక్కలు రావడం ఖాయం. మల్లన్న సాగర్ నుంచి వచ్చే గోదావరి జలాలు వెస్ట్ HYDను మరో స్థాయికి తీసుకెళ్లే ‘ఎకనామిక్ బూస్టర్’.

News January 20, 2026

కూకట్‌పల్లి: భర్తను చంపిన భార్య

image

కూకట్‌పల్లిలోని ఓ కాలనీలో అనుమానాస్పద మృతిగా నమోదైన కేసు హత్యగా తేలింది. సుధీర్ రెడ్డి (44)ని భార్య ప్రసన్న చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి సోదరి సునీత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హత్య ఉదాంతం బయటకొచ్చింది. నిందితురాలిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.