News August 7, 2024
HYD: గాంధీ ఆసుపత్రిలో ఇదీ పరిస్థితి!

గాంధీలో సమస్యలు వెంటాడుతున్నాయి. డాక్టర్లు, మందుల కొరతతో పాటు OP వార్డ్లో ఈసీజీ మిషన్ కూడా లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఎక్స్ రే, MRI స్కాన్ల కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని పేషెంట్లు వాపోతున్నారు. కనీస మందులు కూడా లేకపోవడం గమనార్హం. మందుల కొరత కారణంగా సగం బయట కొనాల్సి వస్తోందని పేషెంట్లు వాపోతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేట్ మెడికల్ షాపులు ఏంటని పేదలు నిలదీస్తున్నారు.
Similar News
News December 11, 2025
BREAKING: కాంగ్రెస్ సపోర్ట్.. లగచర్లలో సర్పంచ్ ఈయనే!

వికారాబాద్ జిల్లాలో ఉత్కంఠను రేపిన లగచర్లలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఘన విజయం సాధించారు. ఇక్కడ గెలిచేందుకు ప్రత్యర్థులు సర్వ శక్తులు ఒడ్డినా.. చివరి నిమిషంలో వెంకట్రాములు గౌడ్ 15 ఓట్ల తేడాతో గెలుపొందారు. BRS బలపరిచిన గుండెమోని బసప్ప ఓటమి చవిచూశారు. దీంతో వెంకట్రాములుకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేశాయి.
News December 11, 2025
వార్డులు.. HYDలో వార్ మొదలు

GHMC వార్డులను 150 నుంచి ఏకంగా 300కు పెంచడంతో నగరంలో ఎన్నికల వేడిని రాజేసింది. ఈ నిర్ణయం కాంగ్రెస్-MIM రహస్య ఒప్పందమంటూ BJP తీవ్రస్థాయిలో మండిపడుతోంది. MIM డివిజన్లను 46 నుంచి 90కి పెంచి, కాంగ్రెస్ పరోక్షంగా లబ్ధి పొందుతోందని కమలదళం ధ్వజమెత్తింది. GHMC పరిధిలోని 50కి పైగా డివిజన్లలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు గాలం వేస్తూ ఎన్నికల వ్యూహాలకు INC పదును పెడుతోంది. అసలు ఆట ఇప్పుడే మొదలైంది.
News December 11, 2025
HYD: బ్యాలెట్ పేపర్ చించేశాడు.. ఓటరుపై కేసు

శంషాబాద్లో బ్యాలెట్ పత్రాన్ని చింపేసిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలోని బురుజు గడ్డ తండాలో పోలింగ్ కేంద్రానికి ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి బ్యాలెట్ పత్రాన్ని చించి వేశారు. ఈ ఘటనపై ఎలక్షన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక అభ్యర్థికి ఓటు వేయబోయి.. పొరపాటున మరొకరికి తన ఓటు వేశానని పేపర్ చింపివేసినట్లు విచారణలో తేలింది.


