News November 7, 2025

HYD: ట్రబుల్ షూటర్ వచ్చేస్తున్నారు!

image

పితృవియోగంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు మళ్లీ యుద్ధరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడుతుండడంతో, ట్రబుల్ షూటర్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS జైత్రయాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టేందుకు, హరీశ్ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News January 20, 2026

నైనీ కోల్ టెండర్లపై CBIతో విచారించాలి: రాంచందర్

image

TG: నైనీ కోల్ బ్లాక్‌ టెండర్ల వివాదంతో CM, మంత్రుల విభేదాలు బట్టబయలయ్యాయని TBJP చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. ‘బంధువులకు గనులు కేటాయించుకోవాలని చూశారు. మీడియాలో వార్తలతో టెండర్లు రద్దు చేశారు. దీనిపై CBI, మరేదైన సంస్థతో విచారించాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే అర్హత BRSకు లేదన్నారు. BRS హయాం నుంచి ఇప్పటి INC GOVT వరకు జరిగిన అవినీతిపై విచారణ జరగాలని పేర్కొన్నారు.

News January 20, 2026

ఆ దేశాలనూ అమెరికాలో కలిపేసిన ట్రంప్!

image

యూరోపియన్ దేశాలు, US మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ట్రంప్ రిలీజ్ చేసిన AI జనరేటెడ్ మ్యాప్ వైరల్ అవుతోంది. అందులో కెనడా, గ్రీన్‌లాండ్, వెనిజులా US భూభాగానికి చెందినవి అన్నట్లు ఉంది. ఈ ఫొటోను ఆయన ట్రూత్‌లో పోస్ట్ చేశారు. గతేడాది EU లీడర్లతో ట్రంప్ భేటీ కాగా, అప్పటి ఫొటోను మార్ఫ్ చేశారు. ఆ సమయంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్, ఇటలీ PM మెలోని, UK PM కీర్ స్టార్మర్‌ తదితరులతో ట్రంప్ సమావేశమయ్యారు.

News January 20, 2026

ప.గో: ఇంటర్ పరీక్షలపై డీఆర్వో సూచనలు

image

ఈ నెల 21 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. విద్యుత్, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.