News November 19, 2025
HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 23, 2026
నేడే సెకండ్ T20.. అక్షర్ పటేల్, బుమ్రా దూరం!

నేడు రాయ్పూర్ వేదికగా IND-NZ మధ్య రెండో T20 జరగనుంది. తొలి మ్యాచ్లో గాయపడిన అక్షర్ పటేల్ ఇవాళ ఆడే పరిస్థితి కనిపించట్లేదు. అతని స్థానంలో కుల్దీప్ ఆడే ఛాన్సుంది. మరోవైపు వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకి రెస్ట్ ఇచ్చి హర్షిత్కు అవకాశమివ్వొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అతనొస్తే బ్యాటింగ్ పరంగానూ కొంత బలం పెరుగుతుంది అంటున్నారు. రా.7గం.కు స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు.
News January 23, 2026
తాడిపత్రిలో పొలిటికల్ టెన్షన్

సవాల్.. ప్రతి సవాల్తో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేతిరెడ్డి సవాల్ విసరగా మీ ఇంటి వద్దే సవాల్ స్వీకరిస్తామని టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు, జేసీ అభిమానులు నేడు ఎమ్మెల్యే అస్మిత్ ఇంటి వద్దకు తరలిరావాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
News January 23, 2026
వరిలో రాగి, బోరాన్ లోపాన్ని ఇలా గుర్తించండి

వరిలో రాగి సూక్ష్మపోషకం లోపిస్తే ఆకు చివర ఎండి, ఆకుపై ముతక ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. వెన్నులోని గింజలు చిన్నవిగా ఉంటాయి. రాగి లోప నివారణకు ఆకులపై ఒక లీటరు నీటిలో 1 గ్రాము కాపర్సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. బోరాన్ లోపిస్తే పంట లేత ఆకుల చివరలు మెలితిరిగి, వేర్లు వృద్ధి చెందవు. పంట ఎదుగుదల సరిగా ఉండదు. బోరాన్ లోప నివారణకు లీటరు నీటికి 1 గ్రాము బోరాక్స్ ద్రావణాన్ని కలిపి పంటపై పిచికారీ చేయాలి.


