News November 19, 2025
HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
Similar News
News January 23, 2026
కామారెడ్డి: ‘నిర్భయంగా ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’

జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మతం, కులం, జాతి ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
News January 23, 2026
ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చంటి బాధ్యతలు

ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొని చంటికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా గ్రూపు రాజకీయాలు చేయవద్దని సూచించారు. పార్టీ విషయాలను నాలుగు గోడల మధ్య మాట్లాడాలని, 40 మందిలో మాట్లాడవద్దని ప్రతి కార్యకర్తకు సూచించారు.
News January 23, 2026
KMR: 4,408 ఫోన్లు రికవరీ

సెల్ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, CIER పోర్టల్ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం కామారెడ్డిలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రికవరీ వివరాలను వెల్లడించారు. CEIR పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ₹7.05 కోట్ల విలువైన 4,408 ఫోన్లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.


