News November 19, 2025

HYD: ప్రజాభవన్‌లో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

image

HYD బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఈరోజు నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను రూపుమాపేలా నిపుణులు, మేధావులు, అధికారుల సలహాలు తీసుకుంటామని చెప్పారు.

Similar News

News January 22, 2026

కడప: ‘పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి’

image

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి రెండవ వారంలోగా పనులను పూర్తి చేయాలని కోరారు.

News January 22, 2026

కడప: ‘పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి’

image

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి రెండవ వారంలోగా పనులను పూర్తి చేయాలని కోరారు.

News January 22, 2026

చిత్తూరు: 71 సెంటర్లలో ఇంటర్ ప్రాక్టికల్స్

image

చిత్తూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై తన కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష చేశారు. 71 సెంటర్లలో నిర్వహించే పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11వేల మంది హాజరవుతారని చెప్పారు.