News November 19, 2025
HYD: ప్రత్యేక లోక్ అదాలత్లో 11,226 కేసుల పరిష్కారం

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.
Similar News
News January 24, 2026
ఫిరంగిపురంలో చెత్త సంచిలో చిన్నారి

ఫిరంగిపురంలో కనిపించిన ఈ దృశ్యం నిజంగానే గుండెను బరువెక్కించేలా ఉన్నాయి. ‘లోకమంతా బడి బాట పడుతుంటే.. ఈ చిన్నారి మాత్రం చెత్త సంచిలో’ ఒదిగిపోయాడు. రిక్షా వెనుక వేలాడుతున్న ఆ సంచే ఆ పసివాడికి ఊయల అయ్యింది. రేపటి పౌరుడిగా ఎదిగాల్సిన వయసులో, చెత్త కుప్పల మధ్య తన భవిష్యత్తును వెతుక్కుంటున్న ఆ చిన్నారి చూపులు సమాజాన్ని నిలదీస్తున్నట్లుగా ఉన్నాయి.
News January 24, 2026
విశాఖ: చదువుకున్న వారే మోసపోతున్నారు..

చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులే ఉన్నారు. తాజాగా నగరంలోని ఓ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి సైబర్ ముఠా రూ.10 లక్షల వరకు కాజేశారు. ఈ కేసులో విశాఖ సైబర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వరంగల్ ప్రాంతానికి చెందిన రమేశ్, పరుశురాములు, నిశాంత్ కలిసి ఓ వ్యక్తి అకౌంట్ తీసుకుని సైబర్ క్రైమ్ ముఠాకు కమిషన్ రూపంలో అప్పజెప్పినట్లు దర్యాప్తులో తేలింది.
News January 24, 2026
రానున్న 24 గంటల్లో వర్షాలు

AP: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, 2-3డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పింది. మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్లూరి (D) జి.మాడుగులలో 6.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.


