News November 19, 2025
HYD: ప్రత్యేక లోక్ అదాలత్లో 11,226 కేసుల పరిష్కారం

ప్రత్యేక లోక్ అదాలతో మొత్తం 11,226 కేసులు రాజీ అయినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. సిటీ సైబర్ క్రైమ్ PSతో పాటు జోనల్ సైబర్ క్రైమ్ యూనిట్స్లో 709 కేసులు పరిష్కారం చేసి 3 కమిషనరేట్లలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించామని వివరించారు. వివిధ సైబర్ నేరాలకు సంబంధించిన నేరగాళ్ల బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేసిన రూ.5,77,78,601 నగదును బాధితులకు రీఫండ్ చేశామన్నారు.
Similar News
News January 20, 2026
PDPL: ‘వడ్డీ లేని రుణాల పంపిణీ వేగిరం చేయాలి’

పట్టణ ప్రాంతాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం PR మంత్రి సీతక్కతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమీక్ష సమావేశంలో PDPL కలెక్టర్ శ్రీ హర్ష పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరల పట్ల మహిళల నుంచి మంచి స్పందన వస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు సత్వరం చీరల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాల జారీ చేశారు.
News January 20, 2026
పెద్దపల్లి: ట్రాన్స్ జెండర్లకు ఉపాధి యూనిట్లు

పెద్దపల్లి జిల్లాలో గల ట్రాన్స్ జెండర్లకు ఉపాధి హామీ పథకం కింద రెండు యూనిట్లు అందజేశారు. అదనపు కలెక్టర్ దాసరి వేణు (రెవెన్యూ) ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు రూ.1.50లక్షల లోన్స్ మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావు, సూపర్డెంట్ రాజయ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత, ట్రాన్స్ జెండర్లు తదితరులు పాల్గొన్నారు.
News January 19, 2026
SRCL: ‘మహిళల ఆర్థిక ప్రగతితో దేశ రాష్ట్ర ప్రగతి సాధ్యం’

మహిళల ఆర్థిక ప్రగతితో దేశ, రాష్ట్ర ప్రగతి సాధ్యమనే ఉద్దేశ్యంతో ప్రతి ప్రభుత్వ పథకంలో వారిని భాగస్వామ్యులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల పనులు, అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని, స్కూల్ పిల్లల యూనిఫాంలు కుట్టించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.


