News November 19, 2025
HYD: ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ యాక్సిడెంట్లు

గ్రేటర్ HYDలో 2025 సెప్టెంబర్ వరకు 4,112 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 613 మంది ప్రాణాలు కోల్పోయారు. సెల్ఫ్ యాక్సిడెంట్లలోనే 140 మంది మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అతివేగం ప్రధాన కారణంగా కాగా, మొత్తం ప్రమాదాల్లో 30- 35 శాతం కేసులు నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
Similar News
News January 23, 2026
సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. M.Tech ఇన్ ECE పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://iiits.ac.in/careersiiits/jrf-srf-project-positions/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 27.
News January 23, 2026
రాయచోటిలో ఆపరేషన్ వికటించి తల్లిబిడ్డల మృతి

అన్నమయ్య జిల్లా రాయిచోటిలో ఆపరేషన్ వికటించి తల్లిబిడ్డలు మృతి చెందిన విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాయచోటిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి వద్ద చోటుచేసుకున్న ఘటన వివరాలను మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దమండెం మండలం చింతమానివారిపల్లికి చెందిన తవలం వెంకటరమణ భార్య ఈశ్వరమ్మ ప్రసవ నొప్పులతో రాయచోటిలోని ఓ ఆసుపత్రికి వెళ్లగా ఈ ఘటన జరిగిందన్నారు.
News January 23, 2026
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్పీ

వాహనదారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. అనంతపురంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దీనివల్ల సాటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


