News September 13, 2025

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కవిత ఆగ్రహం

image

పేద విద్యార్థుల చదువులపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత HYDలో విమర్శించారు. రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఉన్నత విద్యాసంస్థలు బంద్ అయ్యే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. బకాయిలను చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు.

Similar News

News December 15, 2025

2029 ఎన్నికల్లో పోటీ చేస్తా: కవిత

image

TG: 2029 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. Xలో ఆమె #AskKavitha హ్యాష్ ట్యాగ్‌తో క్వశ్చన్ హవర్ నిర్వహిస్తున్నారు. మీ కొత్త పార్టీ పేరు ఏంటి? అని ఓ నెటిజన్ అడగగా ‘ఎలా ఉండాలి’ అని ఆమె బదులిచ్చారు. జాగృతిని గ్రామాలకు విస్తరిస్తానని, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. 2047 నాటికి ఫ్రీ&క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అందించడమే తన విజన్&మిషన్ అని పేర్కొన్నారు.

News December 15, 2025

MTM: కొట్లాడుకున్నారు.. కలిసి విగ్రహాలు పెడుతున్నారు.!

image

మచిలీపట్నం నియోజకవర్గ కూటమిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం తమ పార్టీ ముఖ్య నేతల విగ్రహాల ప్రతిష్ఠ విషయంలో రోడ్డెక్కి రచ్చ చేసిన TDP, BJP నేతలు నేడు ఒకటైపోయారు. హౌసింగ్ బోర్డ్ రింగ్‌లో వాజ్ పేయి విగ్రహం పెడతామని, కాదు NTR విగ్రహం పెడతామని ఆందోళనకు దిగిన ఇరు పార్టీల వాళ్లు పార్టీ పెద్దల ఆదేశాలతో అదే సెంటర్‌లో ఈ నెల 16న ఇద్దరి మహనీయుల విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు సిద్ధమయ్యారు.

News December 15, 2025

తూ.గో: కల్లు అమ్మకాలు నిలిపివేయించిన ఎమ్మెల్యే.. అసలేం జరిగిందంటే..!

image

ఆధ్యాత్మిక స్థలాల్లో ధార్మిక ఆచారాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. ఏవీఏ రోడ్డులోని జీవకారుణ్య సంఘ స్థలంలో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ చొల్లంగి ఏడుకొండలు కల్లు విక్రయాలు సాగిస్తున్నట్లు తెలియడంతో అధికారులతో కలిసి అక్కడికి వెళ్లి వాటిని నిలిపివేయించారు. పవిత్రమైన ప్రాంతాల్లో ఇలాంటి పనులు చేయడం తగదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది హెచ్చరించారు.