News April 30, 2024

HYD: ఫ్లై ఓవర్ పై నుంచి పడి కార్మికుడు మృతి

image

ఫ్లై ఓవర్ పైనుంచి పడి ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన అంబర్‌పేటలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ప్రబీర్ సర్దార్(22) చే నెంబర్ ఫ్లై ఓవర్ పై సెంట్రింగ్ పని చేస్తుండగా కాలుజారి కిందపడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయం అయింది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 14, 2025

రంగారెడ్డి: మొదలైన పోలింగ్.. ఓటేయండి

image

రంగారెడ్డి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. షాబాద్‌ మం.లోని ఎల్గొండగూడలో‌ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 178 జీపీలకు ఎన్నికల జరగనుండగా.. ఇప్పటికే కొన్ని ఏకగ్రీవం అయ్యాయి. మిగతా అన్ని పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. వెళ్లి ఓటేయండి.

News December 14, 2025

రంగారెడ్డి: 2nd ఫేజ్.. సర్పంచ్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

image

రంగారెడ్డి జిల్లాలో నేడు రెండవ విడతలో భాగంగా సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. శంకర్‌పల్లి 24, మొయినాబాద్ 19, చేవెళ్ల 25, షాబాద్ 41, ఆమనగల్లు 13, కడ్తాల్ 24, తలకొండపల్లి 32 GPలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన GPలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఫలితాల కోసం Way2Newsను చూడండి.
SHARE IT

News December 14, 2025

రంగారెడ్డి: 2nd ఫేజ్.. సర్పంచ్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

image

రంగారెడ్డి జిల్లాలో నేడు రెండవ విడతలో భాగంగా సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. శంకర్‌పల్లి 24, మొయినాబాద్ 19, చేవెళ్ల 25, షాబాద్ 41, ఆమనగల్లు 13, కడ్తాల్ 24, తలకొండపల్లి 32 GPలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన GPలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఫలితాల కోసం Way2Newsను చూడండి.
SHARE IT