News April 30, 2024
HYD: ఫ్లై ఓవర్ పై నుంచి పడి కార్మికుడు మృతి

ఫ్లై ఓవర్ పైనుంచి పడి ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన అంబర్పేటలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కి చెందిన ప్రబీర్ సర్దార్(22) చే నెంబర్ ఫ్లై ఓవర్ పై సెంట్రింగ్ పని చేస్తుండగా కాలుజారి కిందపడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయం అయింది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 13, 2025
HYD: ప్రముఖుల బసకు చిరునామా.. ఫలక్నుమా

ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్లో పాల్గొననున్నారు. దీని కోసం హైదరాబాద్కు వచ్చిన మెస్సీకి ప్రభుత్వం ఫలక్నుమా ప్యాలెస్లో బస ఏర్పాటు చేసింది. ఫలక్నుమా ప్యాలెస్ ప్రముఖులు బస చేసేందకు చిరునామాగా మారింది. దీన్ని 1893లో నిర్మించగా.. 1895 నుంచి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గెస్ట్ హౌస్గా వాడేవారు. ప్రస్తుతం తాజ్ గ్రూప్ ప్యాలెస్ను లీజ్ తీసుకుంది.
News December 13, 2025
హైదరాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. అత్యంత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు వణుకుతున్నారు. గత వారం రోజుల్లో అత్యల్పంగా సగటున 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం, రాత్రి పొగ మంచు ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News December 13, 2025
రేవంత్ vs KTR: హైదరాబాదీలకు నిరాశ!

HYDకు తలమానికంగా రూ.75 కోట్లతో HMDA అభివృద్ధి చేసిన కొత్వాల్గూడ ఈకో పార్క్ ఇప్పుడు రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఈ పార్కు ఓపెనింగ్ను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని KTR విమర్శించారు. DEC 9న CM చేతుల మీదుగా ప్రారంభం కావాల్సిన పార్క్.. KTR విమర్శల కారణంగానే వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల కొట్లాటలో దేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం వంటి అద్భుతాలు చూడాలనుకున్న HYD ప్రజలకు నిరాశే మిగిలింది.


