News November 19, 2025

HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

image

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.

Similar News

News January 13, 2026

ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులకు నిధులు

image

TG: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బిల్లులు ఆగిపోయిన ఎల్-3 కేటగిరీ లబ్ధిదారులకు బకాయిలను విడుదల చేశారు. కలెక్టర్ల నివేదికల మేరకు అర్హులైన లబ్ధిదారుల పెండింగ్ బిల్లులకు రూ.12.17 కోట్లు రిలీజ్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ MD వి.పి.గౌతం తెలిపారు. అద్దె ఇళ్లలో ఉంటూ ఇండ్లు నిర్మించుకుంటున్న వారితోపాటు, పాత ఇందిరమ్మ పథకంలో బేస్‌మెంట్ వరకే పనులు చేసిన వారి పెండింగ్ బిల్లులనూ ఈ నిధులతో క్లియర్ చేయనున్నారు.

News January 13, 2026

‘చైనా పార్టీ’తో BJP సమావేశంపై కాంగ్రెస్ ఫైర్

image

సరిహద్దుల్లో చైనా షాక్స్‌గామ్ వ్యాలీని ఆక్రమించుకుంటూ ఉంటే.. BJP నేతలు ఆ దేశ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులతో ఢిల్లీలో రహస్య చర్చలు జరపడం ఏంటని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. గల్వాన్‌లో సైనికులు ప్రాణత్యాగం చేసినా, అరుణాచల్‌లో చైనా గ్రామాలు కడుతున్నా BJPకి పట్టదా? అని సుప్రియా శ్రీనేత్ ప్రశ్నించారు. అసలు ఈ బంధం వెనక ఉన్న ఒప్పందం ఏంటని ధ్వజమెత్తారు. BJP నేతలతో CCP ప్రతినిధులు సోమవారం సమావేశమయ్యారు.

News January 13, 2026

అన్నమయ్య జిల్లాలో DSC ఉద్యోగాలు ఇలా..!

image

రాబోయే DSC నోటిఫికేషన్‌లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70-30%తో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్టు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. 560కి పైగా పోస్టులు ఉండగా.. 30% నోటిఫికేషన్ 70% పోస్టులను పదోన్నతులతో నింపనున్నారు. ఖాళీల జాబితాను అధికారులు సిద్ధంచేస్తున్నట్టు చెప్పారు. ఈ నెలాఖరుకల్లా పూర్తి పోస్టుల జాబితా వస్తుందన్నారు. నూతన DSC ప్రకటన ఫిబ్రవరిలో వెలువడనుండగా జూన్ చివరికి నియామక ప్రక్రియ పూర్తవనుంది.