News March 25, 2024

HYD: మల్లారెడ్డి మార్క్ చూయిస్తారా?

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ గెలవదని, అన్నీ BRSయే గెలిచి చూపిస్తామని గతంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి అన్నారు. అన్నట్టుగానే మొత్తం 7 స్థానాల్లో BRSని గెలిపించి చూయించారు. మల్కాజిగిరి గడ్డ BRS అడ్డా అని చెబుతున్న ఆయన.. మరి పార్లమెంట్ ఎన్నికల్లో BRS అభ్యర్థిని గెలిపించి తన మార్క్ చూయిస్తారా లేదా చూడాలి. మీ కామెంట్?

Similar News

News December 5, 2025

HYD: పునర్విభజనపై అభిప్రాయానికి సిద్ధమా?

image

గ్రేటర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు విలీనం చేయడంతో ఇపుడు అధికారులు వార్డుల పునర్విభజనపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారు. ఇందుకు వారం గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత పది రోజుల్లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తిచేస్తారు. అప్పుడే అసలు ఎన్ని వార్డులు వచ్చే అవకాశముందనే విషయంపై క్లారిటీ వస్తుంది.

News December 5, 2025

HYD: ‘మెట్రో’ భూములు ఏమయ్యాయి?

image

మెట్రో రైలు నిర్మాణంలో భాగంగా అప్పటి ప్రభుత్వం మెట్రోకు 57 ఎకరాలను కేటాయించింది. మెట్రో అధికారులు మాత్రం కేవలం 18 ఎకరాలను మాత్రమే వినియోగించారు. మూసారంబాగ్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మాదాపూర్‌లో మాత్రమే మాల్స్ కట్టి మిగతా 39 ఎకరాలను వదిలేసింది. ఇపుడు ఈ స్థలాలను ఆడిటింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఆ భూములు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? ఎందుకు వాటిని వాడుకోలేదని తెలుసుకునే పనిలో పడ్డారు.

News December 5, 2025

OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.