News November 19, 2025
HYD: ముందే ఉంటుంది మృత్యువు.. చూసి వెళ్లండి

శీతాకాలంలో పొగమంచు పెరగడంతో రోడ్లపై ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పోలీసు అధికారులతో సమీక్షించారు. ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్న సీపీ, వేగ నియంత్రణ, హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు వంటి ముందస్తు చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News January 20, 2026
MHBD: సీఎం కప్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘చీఫ్ మినిస్టర్ కప్ – 2025’ క్రీడా పోటీలు నిర్వాహించనున్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ అద్విత్ కుమార్ సింగ్ తెలిపారు. https://satg.telangana.gov.in/cmcup /signup లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
News January 20, 2026
ఖమ్మం మార్కెట్లో ‘మిర్చి’ ఘాటు.. పత్తి ధరకూ రెక్కలు!

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వాణిజ్య పంటల ధరలు ఊపందుకున్నాయి. దేశీయంగా డిమాండ్ పెరగడంతో తేజ రకం మిర్చి క్వింటాలు గరిష్ఠంగా రూ.16,300 పలికింది. అటు పత్తి ధర కూడా వారం వ్యవధిలో రూ.1,000 పెరిగి క్వింటాలు రూ.8,000కు చేరడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే సుమారు 30 వేల బస్తాల మిర్చి అమ్మకానికి రాగా, మార్కెట్ ఛైర్మన్ కొనుగోళ్లను పర్యవేక్షించారు.
News January 20, 2026
రేషన్ కార్డు ప్రామాణికంగా ఇందిరమ్మ చీరల పంపిణీ: కలెక్టర్

మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పురపాలక సంఘాల్లో మహిళలకు వడ్డీలేని రుణాలు, చీరల పంపిణీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి చీరల పంపిణీని 3 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.


