News August 13, 2025
HYD: మెట్రో జోన్లో కరెంట్ తీగల మార్పునకు కీలక నిర్ణయం..!

గ్రేటర్ HYD వ్యాప్తంగా మెట్రో జోన్ పరిధిలో దాదాపు 550 కిలోమీటర్ల మేరకు లైన్లలో మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న తీగల స్థాయిలో ఎయిర్ బెంచ్ కేబుల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ సెంట్రల్, సౌత్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్స్ పరిధిలో పోల్ టూ పోల్ తనిఖీల్లో ఓవర్ హెడ్ కండక్టర్లను మార్చాల్సిందిగా గుర్తించారు.
Similar News
News March 12, 2026
ఈ నెలలోనే రైతు భరోసా: మంత్రి వివేక్

TG: ‘రైతు భరోసా’ నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు మంత్రి వివేక్ శుభవార్త చెప్పారు. ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనున్నట్లు చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వెల్లడించారు. రైతు భరోసా కింద మొత్తం రూ.9,000కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో తొలి విడతగా రూ.4,500కోట్లు, మిగతావి వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
News March 12, 2026
జగన్కు మంత్రి సవిత వార్నింగ్!

కూటమిపై బురద జల్లడం మానుకోవాలని జగన్కు మంత్రి సవిత హితువు పలికారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మోసాలకు, అబద్ధాలకు మారు పేరు జగన్ అన్నారు. ఆయనకు విజన్ లేదని, రాష్ట్రం గురించి ఆలోచన లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేసినా జగన్ పారిపోయాడన్నారు. నాలుగు గోడల మధ్య కూర్చొని చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం మానుకోవాలన్నారు. లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
News March 12, 2026
కర్నూలు: సెలవుల్లేని సేవ.. రోగులకు అండగా సిరాజ్ ఉల్

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ సిరాజ్ ఉల్ 15 ఏళ్లుగా నిరంతరం రోగులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెలవులు, ఆదివారాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే సుమారు 700 మంది రోగులకు మందులు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు ఒకే కౌంటర్ ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రమబద్ధంగా మందులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు.


