News August 3, 2024

HYD: యూనివర్సిటీలో 85 శాతం సీట్లు తెలంగాణ వారికే!

image

HYD మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం 2024-25 నుంచి 85% సీట్లు తెలంగాణ స్థానికత ఉన్నవారికే కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇది అమలులోకి వచ్చిందని తెలిపారు. 15% అన్ రిజర్వుడ్‌గా ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

KPHB సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

KPHB PS పరిధిలోనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News December 16, 2025

HYD: దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? బుక్ చదివారా?

image

తాపీ ధర్మారావు రచించిన <<18569096>>ఈ పుస్తకం<<>> ఆలయ శిల్పాలపై ఉన్న అజ్ఞానం, ద్వంద్వ నైతికతను ప్రశ్నిస్తుంది. శృంగార శిల్పాలపై ఉన్న అసభ్య ముద్రను చెరిపేసి, వాటి వెనుక దాగిన సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక తాత్విక అర్థాలను స్పష్టంగా విశ్లేషిస్తుంది. కోరికల నియంత్రణ, జీవన సమగ్రత, ఆలయం వెలుపల- లోపల తాత్విక భావనను సంక్షిప్తంగా వివరిస్తుంది. ఖజురహో వంటి ఉదాహరణలతో చరిత్రను విశ్లేషించి, పాఠకుడిని ఆలోచింపజేస్తుంది.

News December 16, 2025

నెహ్రూ జూ పార్క్‌లో AI కమాండ్ కంట్రోల్ సెంటర్‌

image

నెహ్రూ జూ పార్క్ చరిత్రలో ఒక అద్భుతం జరగబోతోంది. త్వరలో AI కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అడవి బిడ్డల రక్షణలో ఇది సరికొత్త రికార్డు సృష్టించనుంది. AI సాయంతో జంతువుల ప్రతి కదలికను, వాటి ఆరోగ్యాన్ని 24/7 పర్యవేక్షించవచ్చు. ఏదైనా చిన్న మార్పు వచ్చినా ఈ స్మార్ట్ సెంటర్ వెంటనే హెచ్చరిస్తుంది. ప్రైవేట్ సౌండ్-ప్రూఫ్ టెక్నాలజీతో ఈ కేంద్రాన్ని నిర్మించడం విశేషం.